ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సామాజిక సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా వాహనమిత్ర పథకం (Vahanamitra Scheme) సంబంధించిన మార్గదర్శకాలు, నిధుల విడుదల షెడ్యూల్ ప్రకటించింది. ప్రభుత్వం ప్రతి ఏడాది ఒక నిర్దిష్ట సమయంలో డ్రైవర్ల ఖాతాల్లో నేరుగా ఈ మొత్తాన్ని జమ చేస్తుంది. దీని వల్ల లబ్ధిదారులు తమ వాహనాలకు సంబంధించిన ఫిట్నెస్ సర్టిఫికెట్ ఫీజులు (Fitness Certificate Fees), బీమా ప్రీమియాలు, మరమ్మతులు, వాహనం మెయింటెనెన్స్ వంటి ఖర్చులకు సౌలభ్యంగా ఈ మొత్తాన్ని వినియోగించుకోవచ్చు. రవాణా శాఖ ద్వారా కొత్తగా జారీ చేసిన G.O.Ms.No.33 (13-09-2025) ప్రకారం, ఆటో రిక్షా (Auto Rickshaw), మోటర్ క్యాబ్ (Motor Cab), మ్యాక్సీ క్యాబ్ (Maxi Cab) డ్రైవర్లకు సంవత్సరానికి ₹15,000 Financial Assistance ఇవ్వబోతున్నారు.
దరఖాస్తుదారులకు కొన్ని అర్హతలు ఉండాలి
➤ లబ్ధిదారులకు ఏపీలో జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్స్ (Driving license) ఉండాలి.
➤ వాహనం ఆంధ్రప్రదేశ్లోనే రిజిస్టర్ అయి ఉండాలి
➤ ఆటో రిక్షా లేదా లైట్ మోటార్ వెహికల్ నడపడానికి లైసెన్స్ చెల్లుబాటులో ఉండాలి.
➤ మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్లకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఫిట్నెస్ సర్టిఫికెట్లు కచ్చితంగా ఉండాలి.అయితే ఆటో రిక్షా విషయంలో ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకపోతే ఈ ఒక్క సంవత్సరం అనగా 2025-26 సంవత్సరానికి అనుమతిస్తారు.కానీ, ఒక నెలలోపు ఆ సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది.
➤ వాహనాలకు ఎలాంటి పెండింగ్ బకాయిలు, చలాన్లు ఉండకూడదు.
➤ Rent లేదా Lease పై తీసుకున్న వాహనాలు అనర్హులు.
LAND Related
➤ మాగాణి అయితే 3 ఎకరాలు, లోపు భూమి ఉండాలి
➤ మెట్ట అయితే 10 ఎకరాల లోపు భూమి ఉండాలి.
➤ మాగాణి , మెట్ట రెండు కలిపి 10 ఎకరాల లోపు ఉండాలి
➤ పట్టణ ప్రాంతాల్లో 1,000 చదరపు అడుగుల కంటే ఎక్కువ నివాస లేదా వాణిజ్య నిర్మాణం ఉండకూడదు.
Other
➤ ఇంటి విద్యుత్తు వినియోగం (Power consumption) నెలకు 300 యూనిట్ల కంటే తక్కువగా ఉండాలి. దీని కోసం దరఖాస్తు తేదీకి ముందు 12 నెలల సగటును లెక్కిస్తారు.
➤ Aadhar Card, White Ration Card ఉండాలి.
➤ దరఖాస్తుదారు లేదా వారి కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్ ఉంటే ఈ పథకానికి అనర్హులు. కానీ, పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు మినహాయింపు ఉంటుంది
➤ ఈ పథకం ప్యాసింజర్ ఆటో, క్యాబ్, మోటార్ క్యాబ్ సొంతంగా కలిగిన వారు మాత్రమే అర్హులు. ఒక కుటుంబానికి ఒకే వాహనం ఉన్నా, బహువాహనాలు ఉన్నా ఒక్క యజమానికే సాయం లభిస్తుంది
గ్రామ, వార్డు సచివాలయాల దరఖాస్తు చేసుకోవడానికి
➤ వాహనమిత్ర పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి గ్రామ, వార్డు సచివాలయాల విభాగం (జీఎస్డబ్ల్యూఎస్డీ) సెప్టెంబర్ 17 2025 నాటికి ఆన్లైన్ ప్లాట్ఫామ్ను సిద్ధం చేస్తుంది.
➤ కొత్త లబ్ధిదారులు దరఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబర్ 19 2025 వరకు అవకాశం ఉంటుంది.
➤ సెప్టెంబర్ 22 2025 నాటికి సచివాలయం, మండల, జిల్లా స్థాయిలో పూర్తి స్థాయిలో పరిశీలన చేస్తారు.
➤ తర్వాత తుది జాబితా సెప్టెంబర్ 24కు సిద్ధమవుతుంది.లబ్ధిదారుల జాబితాను కార్పొరేషన్ల వారీగా జీఎస్డబ్ల్యూఎస్ విభాగం 24 నాటికి రవాణా శాఖకు పంపుతుంది.
➤ 2025 అక్టోబర్ 1న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేస్తారు.
ఈ పధనికి సంభంధించిన పాత లబ్ధిదారుల డేటా nbm portal Digital Assistant login నందు excel లో Download చెసుకొవచు.
No comments:
Post a Comment